దేవుడి పాలన మీద నమ్మకం సన్నగిల్లిందా?
అవును నమ్మకం పోయింది అనే అనిపిస్తుంది..
"మేము పరిపాలిస్తే అది దేవుడి పరిపాలన, మేము అధికారం లో వుంటే దేవుడు వర్షాలు కురిపిస్తాడు.." మొదలగు వ్యాఖ్యానాలు చేసిన ఆంద్ర ప్రదేశ్ పాలకులకు ఇప్పుడు వారిది దేవుడి పాలన కాదు అన్న నమ్మకం బలంగా కుదిరినట్లుంది.. అందుకే ఈ సంవత్సరం రుతు పవనాల సమయంలో దేవుడు వర్షం కురిపించడు అని కచ్చితంగా అర్ధమయ్యి మా రాష్ట్రంలో మేఘో మధనం చెయ్యాలి రండి బాబూ అని టెండర్లు పిలిచింది..
మీరు వారు అడిగిన ప్రత్యెక రాడార్ లు అంద చెయ్యగల కాం ట్రా క్టర్లు గనుక అయితే ఈ నెల 29 లోపు ముప్పయ్యి లక్షలు సెక్యూరిటీ కింద గట్టి వేలం పాట లో పాల్గొనచ్చు.. దేవుడి పాలనో కాదో గానీ, మా రాష్ట్ర రైతన్నలకి మాత్రం వర్షాలు కావాలి.. కాబట్టి ఈ మేఘో మధనం జరగాలి.. ఆశిద్దాం ఈ టెండరు లలోనన్నా అవినీతి వుండదు అని..
http://www.anigalla.net/post/RAIN-SHADOW-AREAS-DEVELOPMENT-June-2009-TENDER.aspx